Hyderabad,telangana, ఆగస్టు 14 -- కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద నీరు వస్తోంది. దీంతో ఇవాళ హిమాయత్ సాగర్ రిజర్వాయర్ 9 గేట్లను జలమండలి అధికారులు ఎత్తారు.

రిజర్వాయర్ 9 గేట్లను నాలుగు ఫీటు మేర ఎత్తి మూసీ నదిలోకి 12046 క్యూసెక్కుల వరద నీరును విడదుల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 20000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. 12046 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది.

మరోవైపు ఉస్మాన్ సాగర్ (గండిపేట్) రిజర్వాయర్ కు 2800 క్యూసెక్కుల వదర నీరు వస్తోంది. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 3.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.911 టీఎంసీలు. పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1782.05 అడుగులు ఉంది.

జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయటంతో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కీలక సూచ...