Hyderabad, ఏప్రిల్ 30 -- నాని, శ్రీనిధి శెట్టి నటించిన మూవీ హిట్: ది థర్డ్ కేస్. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా గురువారం (మే 1) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిట్: ది ఫస్ట్ కేస్, హిట్: ది సెకండ్ కేస్ ఇప్పటికే సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలన్న నిర్మాతల అభ్యర్థనకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హిట్ 3 మూవీ టికెట్ల ధరలు పెంచడానికి అనుమతిస్తూ బుధవారం (ఏప్రిల్ 30) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్ లో గరిష్ఠంగా రూ.50, మల్టీప్లెక్స్లో గరిష్ఠంగా రూ.75 పెంచుకోవచ్చు. జీఎస్టీతో కలిపి ఈ మొత్తం పెంచడానికి అనుమతించారు.
పెంచిన ధరలు ఏడు రోజుల పాటు అమల్లో ఉంటాయి. హిట్ 3 నిర్మాతల అభ్యర్థన మేరకు ధరల పెంపునకు అనుమతించి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.