Hyderabad, ఆగస్టు 8 -- బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి జంటగా నటించిన సినిమా కిష్కిందపురి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై డైనమిక్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మించారు. కిష్కిందపురి చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి రచన దర్శకత్వం వహించారు. శ్రీమతి అర్చన ప్రజెంట్ చేస్తున్నారు.

గ్రిప్పింగ్ హర్రర్-మిస్టరీ థ్రిల్లర్‌గా కిష్కిందపురి సినిమాను తెరకెక్కించారు. రాక్షసుడు తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో రెండోసారి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా చిల్లింగ్ ఫస్ట్ గ్లింప్స్‌తో బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తాజాగా మేకర్స్ కిష్కిందపురి నుంచి ఫస్ట్ సింగిల్ ఉండిపోవే నాతోనే లాంచ్ చేశారు.

తాజాగా లాంచ్ చేసిన ఈ పాట మ్యూజిక్ ప్రమోషన్స్‌కి శ్రీకారం చుట్టి ఆడియన్స్‌లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ అందమై...