భారతదేశం, డిసెంబర్ 16 -- హాబేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం "ఎర్రచీర". ది బిగినింగ్ అనేది క్యాప్షన్. ఈ సినిమాలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్ర పోషించింది.

"ఎర్రచీర" మూవీకి సుమన్ బాబు దర్శకత్వం వహించారు. అలాగే, ఎర్రచీర సినిమాలో డైరెక్టర్ సుమన్ బాబు ముఖ్య పాత్ర అయిన హీరోగా చేశారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ కథతో ఈ ఎర్రచీర సినిమా తెరకెక్కినట్లు మేకర్స్ చెబుతున్నారు.

అయితే ఈ సినిమాలో హారర్ సన్నివేశాలు ఎక్కువ ఉన్న కారణంగా ఈ సినిమా చూసిన సెన్సార్ వారు A సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా మేకర్స్ వెల్లడించారు. హార్ట్ పేషెంట్స్ ఈ సినిమానికి చూడటానికి వచ్చినప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని రావలసిందిగా చిత్ర దర్శ...