భారతదేశం, మే 2 -- విద్యుత్తు వినియోగదారులకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. వాట్సాప్ లోనూ సమస్యలపై ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది టీజీ ఎన్పీడీసీఎల్. ఈ మేరకు 'వాట్సాప్ చాట్ బాట్' సేవలను వినియోగంలోకి తీసుకొచ్చి, కన్జ్యూమర్స్ అంతా సేవలను వినియోగించుకోవాలని సూచిస్తోంది.

టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్తు వినియోగదారులకు సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు గతంలోనే.. 1912 టోల్ ఫ్రీ నెంబర్ సేవలను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కొత్తగా వాట్సాప్ చాట్ బాట్ సేవలను అమలులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా విద్యుత్తు వినియోగదారులు మొదట '79016 28348' నెంబర్ సేవ్ చేసుకుని, ఆ నెంబర్ కు వాట్సాప్ లో 'హాయ్' అనే మెసేజ్ పంపించాలి. వెంటనే ఆ వాట్సాప్ చాట్ బాట్ నుంచి రిప్లై వస్తుంది. టీజీ ఎన్పీడీసీ...