భారతదేశం, నవంబర్ 27 -- హాంకాంగ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం కనీసం 44 మంది ప్రాణాలు బలిగొంది. దాదాపు 300 మందికి పైగా ప్రజల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఉత్తర తాయ్ పో జిల్లాలోని వాంగ్ ఫుక్ కోర్ట్ అనే నివాస సముదాయంలో ఈ భారీ అగ్నిప్రమాదం జరిగింది.

నిర్వహణ పనుల సమయంలో ఉపయోగించిన అసురక్షితమైన పరంజా (scaffolding), ఫోమ్ మెటీరియల్స్ కారణంగానే మంటలు వేగంగా వ్యాపించి ఉండవచ్చని పోలీసులు గురువారం అనుమానం వ్యక్తం చేశారు.

పోలీస్ సూపరింటెండెంట్ ఐలీన్ చుంగ్ ఈ ప్రమాదానికి సంబంధించి ఒక నిర్మాణ సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌ను హత్య ఆరోపణలపై అరెస్టు చేసినట్లు తెలిపారు.

"నిర్మాణ సంస్థకు బాధ్యత వహించాల్సిన వ్యక్తులు ఘోరమైన నిర్లక్ష్యం వహించారని, ఇది ఈ ప్రమాదానికి దారితీసిందని, మంటలు అదుపు లేకుండా వ్యాపించి భారీ ప్రాణనష్టానికి కార...