భారతదేశం, మే 26 -- ఏపీలో థియేటర్ల బంద్‌ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి, సినీ పరిశ్రమ పెద్దలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. థియేటర్ల బంద్ వ్యవహారంపై కేవలం విచారణ మాత్రమే చేయమన్నాం.. అరెస్ట్ చేయాలని ఎక్కడా చెప్పలేదని మంత్రి వివరణ ఇచ్చారు. సినిమా పరిజ్ఞానం లేనివారు అజ్ఞానంతో విమర్శిస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి దుర్గేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వ సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజ మహేంద్ర వరంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ రంగంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి దుర్గేష్ పలు వివరాలు వెల్లడించారు.

ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అందరూ కలిసి కట్టుగా వస్తే ఎవరికీ ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా న...