Hyderabad, సెప్టెంబర్ 12 -- సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ సినిమా 'మిరాయ్‌'. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. తేజ సజ్జాకు జోడీగా రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో మిరాయ్ సినిమాను నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న అంటే ఇవాళ మిరాయ్ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల హీరో తేజ సజ్జా విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నాడు.

-మార్పు ఏమీ లేదండి. సినిమాకి పడే కష్టంలో ఎలాంటి తేడా లేదు. ఇంతకుముందు ఎలాగైతే కొత్తరకం సినిమాలు చేయాలని అనుకున్నానో ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను...