భారతదేశం, మే 29 -- తెలుగు హార‌ర్ మూవీ డీమ‌న్ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా గురువారం ఆహా ఓటీటీలో రిలీజైంది. స‌చిన్ మ‌ణి, అబ‌ర్న‌తి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ హార‌ర్ మూవీలో సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా కీలక పాత్రలు పోషించారు. ర‌మేష్ ప‌ళ‌నీవేల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

2023 సెప్టెంబ‌ర్‌లో త‌మిళంలో ఈ మూవీ రిలీజైంది. దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సైక‌లాజిక‌ల్ హార‌ర్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీ ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. రోనీ రాఫెల్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

విఘ్నేష్ శివ‌న్ ఓ సినిమా డైరెక్ట‌ర్‌. తాను తీయ‌బోతున్న హార‌ర్ మూవీ కోసం క‌థ రాసే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. ఎలాంటి డిస్ట్ర‌బెన్స్ లేకుండా క‌థ రాసుకోవ‌డానికి సిటీ మ‌ధ్య‌లో ఉన్న కొత్త బంగ‌ళాకు షిప్ట్ అవుతాడు. ఆ బి...