భారతదేశం, మే 1 -- ఇంటి సామాన్లు, కూరగాయలువంటివి బయటకు వెళ్లి తెచ్చుకునే రోజులు పోయాయి. చాలా మంది ఇప్పుడు ఏదైనా కావాలంటే ఆన్‌లైన్‌‌లో ఆర్డర్ పెడుతున్నారు. కూరగాయలు, పండ్లు, ఆహారం మన ఇంటి వద్దకే రావడం ప్రారంభించాయి. స్విగ్గీ, జొమాటో, జెప్టో వంటి కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. దీనితో పాటు కళ్యాణ్ జ్యువెలర్స్.. బంగారం, వెండి ఆభరణాలు, నాణేలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే సౌకర్యాన్ని కూడా ప్రవేశపెట్టింది.

బంగారం, వెండి నాణేల ఆన్‌లైన్ డెలివరీని అందించడానికి కళ్యాణ్ జ్యువెలర్స్ ఇప్పుడు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది ఒక కొత్త చొరవ అని చెప్పవచ్చు. అదనపు భద్రత కోసం స్విగ్గీ ఈ బంగారు, వెండి నాణేలతో వెనక సీట్లో సెక్యూరిటీ గార్డ్‌ను కూడా డెలివరీ చేసేదాకా పంపిస్తుంది. ఈ రెండు కంపెనీల ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నాయి.

స్వి...