భారతదేశం, మే 19 -- ఖాళీ జాగా క‌నిపిస్తే క‌బ్జా చేసేయ‌డం ప‌రిపాటిగా మారిపోయింద‌ని అనుకుని, గ‌మ్మున ఉండ‌డంలేదు హైదరాబాద్ ప్రజలు. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా ప‌రిష్కార‌మౌతున్న తీరును చూసి హైడ్రాను ఆశ్రయిస్తున్నారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తే ద‌శాబ్దాల స‌మ‌స్యకు ప‌రిష్కారం ఇట్టే దొరుకుతోంద‌ని గ్రహించి న‌గ‌ర‌వాసులు పార్కులు, ర‌హ‌దారులు, ప్రజావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థలాల క‌బ్జాపై ఫిర్యాదులు చేస్తున్నారు.

హైడ్రా ప్రజావాణికి సోమ‌వారం వ‌చ్చిన 59 ఫిర్యాదుల్లో 70 శాతం సామాజిక ఫిర్యాదులే ఉన్నాయి. టోలిచౌకి హ‌కీంపేట‌లో బాబా హోట‌ల్ వ‌ద్ద రోడ్దును ఆక్రమించి షాపు పెట్టేశారంటూ నివాసితులు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ - మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండ‌లం సుభాష్‌న‌గ‌ర్‌లో కొంప‌ల్లికి వెళ్లే 50 అడుగుల ర‌హ‌దారి 100 అడుగుల మేర 10 ఫీట్లకే ప‌రిమిత‌మైంద‌ని స్థానికుల...