భారతదేశం, జనవరి 16 -- బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం. కీలక ఆదేశాలిచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తీసుకున్న చర్యలపై రెండు వారాల్లో అఫిడవిట్ ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్ ను ఆదేశించింది.

స్పీకర్‌కు చివరి అవకాశం ఇస్తున్నామని. రెండు వారాల్లో మిగతా ఎమ్మెల్యేలపై కూడా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని గుర్తు చేసింది. నిర్ణయం తీసుకోకుంటే కీలక పరిణామాలు ఉంటాయని. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....