Khammam,telangana, మే 9 -- జూన్, జులైలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలు వచ్చే నేపథ్యంలో.. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ సత్తా ఏంటో చూపాలన్నారు.

శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. జిల్లాల్లో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ.. ధాన్యం కొనుగోలు జరగడం లేదని విమర్శించారు. 17 నెలల్లో జిల్లాకు ఏం జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలని వ్యాఖ్యానించారు.

"కేసీఆర్ ప్రజల కోసం సీతారామా ప్రాజెక్ట్ తెస్తే ఆ నీళ్ళు నెత్తిన జల్లుకునారు కానీ ప్రజలకు ఏమి చేయలేదు. ఉప ముఖ్యమంత్రి భట్టి అఫిడవిట్, నోట్‌లు అబద్ధపు హామీలు అన్ని ఇచ్చాడు. తప్పకుండా ఇచ్చిన హామీని 100 రోజు...