భారతదేశం, మే 30 -- స్టెయిన్లెస్-స్టీల్ గొట్టాలు, పైపుల తయారీదారు అయిన స్కోడా ట్యూబ్స్ పబ్లిక్ ఆఫర్ మొదటి రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన పొందింది. ఈ రోజుతో ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకునే గడువు ముగుస్తుంది. స్కోడా ట్యూబ్స్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.130-140గా నిర్ణయించారు. ఈ ధరల శ్రేణిలో అత్యధిక స్థాయిలో కంపెనీ విలువ సుమారు రూ.840 కోట్లుగా ఉందని బ్రోకరేజీ సంస్థలు తెలిపాయి.

మొత్తం ఇష్యూ సైజులో 50 శాతం అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, మిగిలిన 15 శాతం నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. స్టెయిన్లెస్-స్టీల్ గొట్టాలు, పైపుల తయారీలో ఈ సంస్థ ప్రత్యేకత కలిగి ఉంది. ఇపిసి, చమురు, గ్యాస్, రసాయనాలు, ఎరువులు, విద్యుత్ వంటి రంగాలలో నిమగ్నమైన పారిశ్రామిక సంస్థలతో సహా అనేక రకాల క్లయింట్లక...