భారతదేశం, జూలై 25 -- రాజస్థాన్లో శుక్రవారం ఉదయం విషాదరకర సంఘటన జరిగింది. ఝలావర్లోని ఓ స్కూల్ భవనం పైకప్పు కూలిపోయింది. ఘటనాస్థలానికి పరుగులు తీసిన అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
కాగా పలు మీడియా నివేదికల ప్రకారం.. రాజస్థాన్లో స్కూల్ భవనం కూలిన ప్రమాదంలో ఇప్పటివరకు నలుగురు మరణించారు. శిథిలాల కింద మరో 40మంది చిక్కుకున్నారు.
"ఝలావర్లోని పిప్లోడి ప్రైమరీ స్కూల్ పైకప్పు ఉదయం 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో కూలిపోయింది. చాలా మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. కలెక్టర్ ఘటనాస్థలానికి చేరుకున్నారు," అని సంబంధిత అధికారులు మీడియాకు చెప్పారు.
రాజస్థాన్లో స్కూల్ భవనం పైకప్పు కూలిన సమయంలో.. లోపల 40మంది విద్యార్థులతో పాటు టీచర్లు- సిబ్బంది కూడా ఉన్నారు.
భారీ శబ్ధం వినిపించిన తర్వాత స్థానికులు ఘటనాస్థలం వద్దకు పరుగులు తీశారు. కానీ అక్కడ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.