భారతదేశం, నవంబర్ 17 -- సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతులు మెుత్తం హైదరాబాద్‌ వాసులు అని అధికారులు తెలిపారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది, మరో కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రయాణికుల్లో మహమ్మద్ అబ్దుల్ షోయబ్ అనే యువకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మృతుల్లో మల్లేపల్లి, బజార్‌ఘాట్‌, ఆసిఫ్‌నగర్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. మొత్తం 54 మంది కలిసి నవంబరు 9న హైదరాబాద్‌ నుంచి జెడ్డాకు వెళ్లారు. నవంబరు 23 వరకు టూర్‌ ప్లాన్‌ చేసుకున్నారు. ఇందులో నలుగురు వ్యక్తులు నిన్న కారులో మదీనాకు వెళ్ల...