Hyderabad, జూన్ 14 -- పంజాబ్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కాంచన్ కుమారి దారుణ హత్యకు గురైంది. సోషల్ మీడియాలో కమల్ కౌర్ బాబీగా బాగా పేరొందిన కాంచన్ కుమారి (30) బోల్డ్ కంటెంట్‌తో సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు చేసేది. ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న కాంచన్ కుమారి తన పోస్టులతో వివాదాలు కూడా ఎదుర్కొంది.

అయితే, పంజాబ్‌లోని బటిండాలో బుధవారం (జూన్ 11) రాత్రి ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్క్ చేసిన ఓ కారులో కాంచన్ కుమారి శవమై కనిపించింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ హత్యను అమృత్ పాల్ సింగ్ గ్యాంగ్ చేసినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన వీడియోను అమృత్ పాల్ సింగ్ రిలీజ్ చేశాడు.

ఆ వీడియోలో కాంచన్ కుమారి సోషల్ మీడియాలో అసభ్య కంటెంట్ (బోల్డ్) పోస్ట్ చేస్తుందని, అందుకు ఇది శిక్షగా చేసిన చర్య అని అమృత్ పాల్ సిం...