భారతదేశం, ఫిబ్రవరి 7 -- ఏదో అనుకుంటే, ఇంకేదో అయింది. పసికూన అమెరికా టీమ్ పై భారత బ్యాటర్లు చెలరేగిపోతారు, రికార్డు స్కోరు సాధిస్తారని అనుకుంటే.. దారుణమైన బ్యాటింగ్ తో పూర్తిగా నిరాశపరిచారు.

డిఫెండింగ్ ఛాంపియన్ గా టీ20 ప్రపంచకప్ లో అడుగుపెట్టిన టీమిండియా ఫస్ట్ మ్యాచ్ లోనే బ్యాటింగ్ లో చతికిలపడింది. కానీ సూర్యకుమార్ (49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 నాటౌట్) అసాధారణ పోరాటంతో ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది.

అభిషేక్ శర్మ క్రీజులో ఉంటే చాలు బౌండరీల సునామీ, పరుగుల తుపాను చూస్తాం. కానీ శనివారం (ఫిబ్రవరి 7) మాత్రం అతని బ్యాట్ సైలెంట్ అయిపోయింది. కనీసం ఒక్క రన్ కూడా చేయకుండా, రెండు బాల్స్ కూడా ఆడకుండా ఔటైపోయాడు అభిషేక్ శర్మ. తాను ఆడిన ఫస్ట్ బాల్ కే క్యాచ్ ఇచ్చేసి గోల్డెన్ డకౌట్ గా పెవిలియన్ చేరిపోయాడు.

ఇండియాతో ఇన్నింగ్స...