భారతదేశం, మే 27 -- కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ అంజారియా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ చందుర్కర్ లకు పదోన్నతులు కల్పిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కొలీజియం సమావేశమై ఈ సిఫారసు చేసింది.

మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, బేలా త్రివేది ఇటీవల పదవీ విరమణ చేసిన తరువాత, సుప్రీంకోర్టు ప్రస్తుతం 31 మంది న్యాయమూర్తులతో పనిచేస్తోంది. సుప్రీంకోర్టులో గరిష్టంగా 34 మంది న్యాయమూర్తులు ఉండాలి. అందువల్ల, సుప్రీంకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. కొలీజియం తాజా సిఫార్సులకు ఆమోదం లభిస్తే సుప్రీంకోర...