భారతదేశం, ఏప్రిల్ 19 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు కార్డులు అందించే కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన వృద్ధులందరికీ డిజిటల్ కార్డులు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే సచివాలయాల్లో ఆప్షన్ ఓపెన్ అయ్యిందని సిబ్బంది తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల రాయితీ సహా ఇతర సదుపాయాలను ఈ కార్డు ద్వారా పొందవచ్చు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సీనియర్ సిటిజన్ కార్డుతో దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రభుత్వ సేవలను సులభంగా, వేగంగా పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది. సీనియర్ సిటిజన్ కార్డు లేనివారు గ్రామ, వార్డు సచివాలయాలతో పాట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.