భారతదేశం, మే 12 -- సీఏ ఇంటర్మీడియట్​, ఫైనల్​ పరీక్షలపై బిగ్​ అప్డేట్​! రివైజ్డ్​ షెడ్యూల్​ని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ చార్టర్డ్​ అకౌంటెంట్స్​ ఆఫ్​ ఇండియా (ఐసీఏఐ) తాజాగా ప్రకటించింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలు 2025 మే 9 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది. కానీ భారత్​- పాకిస్థాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇక ఇప్పుడు.. మే 16, 2025 నుంచి మే 24, 2025 వరకు పరీక్షలు జరుగుతాయని ఐసీఏఐ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

రీషెడ్యూల్ చేసిన పరీక్షలను అదే పరీక్షా కేంద్రాల్లో, అదే సమయాల్లో - మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) / మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) నిర్వహిస్తామని ఐసీఏఐ తెలిపింది. అదనంగా, ఇప్పటికే జారీ చేసిన అడ్మిట్ కార్డులు ర...