భారతదేశం, జూన్ 10 -- పెట్రోల్​, డీజిల్​తో పోల్చితే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తూ, ఎలక్ట్రిక్​ వాహానాల్లో ఉండే రేంజ్​ యాంగ్జైటీ (బ్యాటరీ ఛార్జింగ్​పై ఆందోళనలు) లేని క్లీనర్​ ఫ్యూయెల్​ టెకనాలజీగా సీఎన్జీ (కంప్రెస్డ్​ నేచురల్​ గ్యాస్​) ప్రస్తుతం భారత ప్యాసింజర్ వాహన మార్కెట్​లో దూసుకెళుతోంది. సీఎన్జీ వాహనాలకు ఉన్న డిమాండ్​ చూసి ఈ రంగంలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి దిగ్గజాలు వాహనాలను విక్రయిస్తుండటమే కాకుండా.. రెనాల్ట్, నిస్సాన్ వంటి ఇతర ఓఈఎంలు కూడా తమ వాహనాలకు సీఎన్జీ రెట్రోఫిట్‌మెంట్ కిట్‌లను అందిస్తున్నాయి. టయోటా కూడా మారుతీ సుజుకీ మోడళ్లను రీబ్రాండ్ చేసి భారతదేశంలో సీఎన్జీ కార్లను విక్రయిస్తోంది.

క్యాలెండర్ సంవత్సరం 2024లో, సీఎన్జీ ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు 35 శాతం భారీ వృద్ధిని నమోదు చేశాయి. ఇది క్లీనర్ ఫ్యూ...