భారతదేశం, మే 24 -- ఏపీలో సినిమా హాళ్ల బంద్ కలకలం రేపుతోంది. సరిగ్గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ కు ముందే సినిమా హాళ్ల బంద్ అంశం తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయంపై ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు.

జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. ఎగ్జిబిటర్ల నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి దుర్గేష్ దిశానిర్దేశం చేశారు.

"హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసి వేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ స్పందించి హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తో మాట్ల...