భారతదేశం, మే 7 -- సికింద్రాబాద్‌ పరిధిలోని జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో ఘోర ప్రమాదం జరిగింది. డంపింగ్‌ యార్డు నిర్మాణ పనుల్లో లిఫ్ట్‌ తెగిపడింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పవర్‌ ప్లాంట్‌లో చిమ్నీ అమర్చుతుండగా లిఫ్ట్‌ కూలిపోయిందని అక్కడున్నవారు చెబుతున్నారు. మృతులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సురేశ్‌ సర్కార్‌ (21), ప్రకాశ్‌ మండల్‌ (24), అమిత్రాయ్‌ (20)గా పోలీసులు గుర్తించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....