భారతదేశం, ఏప్రిల్ 23 -- సింహాచలం అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.
సింహాద్రి అప్పన్నస్వామి నిజరూపదర్శనానికి టికెట్ల విక్రయాలు ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమవుతాయని దేవస్థానం ఈవో కె.సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు.
సింహాచలం దేవస్థానం నిర్దేశించిన ప్రాంతాలతో పాటు ఆన్లైన్లో రేపటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు రూ.300, రూ.1000 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు ఈవో ప్రకటించారు. ఈ నెల 29 తర్వాత ఎలాంటి టికెట్ల విక్రయాలు జరగవని స్పష్టం చేశారు.
చందనోత్సవం రోజున కూడా టికెట్లు విక్రయం ఉండదని పేర్కొన్నారు. అలాగే భక్తుల కోసం ఉచిత దర్శనాల క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు ఈవో కె.సుబ్బారావు తెలిపారు.
Publishe...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.