భారతదేశం, మే 3 -- ారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం సహా భారత్ కఠిన చర్యలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం పాక్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకవేళ సింధు జలాల ప్రవాహాన్ని అడ్డుకునేందుకు భారత్ ఆనకట్ట నిర్మిస్తే దాడి చేసి నాశనం చేస్తామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు.

ఓ ఇంటర్వ్యూలో పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే ప్రకటన చేసి పాకిస్థాన్‌కు ఇచ్చే సింధు జలాలను ఆపడం దురాక్రమణగా పరిగణిస్తామని అన్నారు. సింధూ నదీ పరీవాహక ప్రాంతంలో భారత్ ఆనకట్ట నిర్మించడానికి సిద్ధపడితే పాకిస్థాన్ ప్రతిస్పందన ఏమిటని ప్రశ్నించగా, అది పాకిస్థాన్‌పై దురాక్రమణకు సమానమని మంత్రి సమాధానమిచ్చారు. ఫిరంగులు, బుల్లెట్ల ద్వారానే కాకుండా నీటిని ఆపడం లేదా మళ్లించడం కూడా పాకిస్థాన్‌పై దాడి చేయడమేనన...