భారతదేశం, జూన్ 4 -- టాటా హారియర్ ఈవీని రూ .21.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో భారతదేశంలో తాజాగా లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ విడుదలతో, దేశీయ ఆటో తయారీదారు తన ఈవీ గేమ్​ని నెక్ట్స్​ లెవల్​కి తీసుకెళ్లింది. కొత్త యాక్టీ.ఈవీ ప్లస్ ఆర్కిటెక్చర్​పై నిర్మించిన టాటా హారియర్ ఈవీ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ, మహీంద్రా బీఈ6, బీవైడీ అటో 3 వంటి మోడల్స్​కి గట్టి పోటీనిస్తుంది.

టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ వంటి ఎలక్ట్రిక్ కార్ల శ్రేణితో ఇండియన్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్ మార్కెట్​లో సింహభాగాన్ని ఆస్వాదిస్తున్న టాటా మోటార్స్ ఇప్పుడు ఆ మార్కెట్ వాటాను మరింత పెంచుకోవడానికి టాటా హారియర్​ ఈవీ ఉపయోగపడుతుందని భావిస్తోంది.

ఇక ఇప్పుడు హారియర్ ఈవీ, మహీంద్రా ఎక్స్ఈవ...