భారతదేశం, మే 4 -- మచ్​ అవైటెడ్​ ఓలా రోడ్​స్టర్ ఎక్స్​​ ఎలక్ట్రిక్​ బైక్​ డెలివరీలు మరింత ఆలస్యమయ్యాయి! తొలుత మార్చ్​లో డెలివరీలు ప్రారంభిస్తామని చెప్పిన సంస్థ, ఆ తర్వాత దాన్ని ఏప్రిల్​కి మార్చింది. కానీ ఏప్రిల్​లో కూడా ఈ ఎలక్ట్రిక్​ బైక్​ డెలివరీలు మొదలవ్వలేదు. ఇప్పుడు మే నెలలో డెలివరీలు చేస్తామని సంస్థ ప్రకటించింది.

ఓలా దీనిని ధృవీకరించనప్పటికీ, మొదట వాగ్దానం చేసిన టైమ్​లైన్ కంటే ముందు రోడ్​స్టర్ ఎక్స్​లో హోమోలాగేషన్ ప్రక్రియ అసంపూర్తిగా ఉండటం వల్ల డెలివరీల్లో జాప్యం జరిగిందని అనేక నివేదికలు సూచించాయి. ఏప్రిల్ 11, 2025 న రోడ్​స్టర్​ ఎక్స్ ఎలక్ట్రిక్​ బైక్​ మోడళ్ల మొదటి బ్యాచ్ బ్రాండ్ తయారీ కేంద్రం నుంచి విడుదలైందని కంపెనీ పేర్కొంది. కానీ డెలివరీలు ప్రారంభం కాలేదు.

రోడ్​స్టర్​ ఎక్స్​తో పాటు రోడ్​స్టర్​, రోడ్​స్టర్​ ప్రో వంటి బైక్స్​ని ఓ...