Hyderabad, జూన్ 10 -- వ్యాసకృత మహాభారతంలో సావిత్రి కథ మనకు కనిపిస్తుంది. అశ్వపతి, మాలినిల కుమార్తె సావిత్రి. తల్లిదండ్రుల ఆలనా పాలనలో అల్లారుముద్దుగా పెరుగుతుంది. ఒకనాడు చెలికత్తెలతో విహరిస్తుండగా, సాల్వపతి ద్యుమత్సేనుని కుమారుడైన సత్యవంతుడు, విగతచక్షుడైన తండ్రిని తల్లిని కావడిలో మోస్తూ తీసుకువెడుతూ కనిపించాడు.

తల్లిదండ్రులను ప్రేమగా చూస్తున్న సత్యవంతుణ్ణి వివాహమాడాలని భావిస్తుంది సావిత్రి. వివాహమైన సంవత్సరానికే సత్యవంతుడు మరణిస్తాడని తెలిసి కూడా అతనినే వివాహమాడాలని నిశ్చయించుకుంటుంది. తల్లిదండ్రులను కూడా ఒప్పించి అతనినే పెళ్లాడి వనసీమకు కాపురానికి వెళ్తుంది. వారి అన్యోన్య దాంపత్య జీవితం సంవత్సర కాలం పూర్తవుతుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఒకనాడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లిన సత్యవంతుడు సొమ్మసిల్లిపోతాడు. హఠాత్తుగా...