భారతదేశం, మే 15 -- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ... గురువారం సాయంత్రం సరస్వతీనదిలో పుష్కర స్నానం ఆచరించారు.

అనంతరం సరస్వతీ నదికి హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతిదేవి విగ్రహాన్ని, భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది కలిసే కాళేశ్వరం త్రివేణి సంగమంలో మే 15 నుంచి 26 వరకు పుష్కరాలు జరగనున్నాయి.

ప్రతిరోజూ సరస్వతీ ఘాట్‌లో సాయంత్రం 6.45 నుంచి 7.35 గంటల వరకు సరస్వతి నవరత్న మాల హారతి నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీంతో పాటు కళా, సాంస...