Hyderabad, జూన్ 3 -- హారర్ కామెడీ మూవీ శుభం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయింది. కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్ తో సమంత రూపొందించిన ఈ మూవీ.. ఏకంగా రూ.7 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇక ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. జూన్ 13న జియోహాట్‌స్టార్ ఓటీటీ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే డిజిటల్ హక్కుల కోసం ఆ ఓటీటీ భారీగానే చెల్లించిందట.

శుభం మూవీ మే 9న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. అదే సమయంలో శ్రీవిష్ణు సింగిల్ మూవీ కూడా రావడంతో సమ్మర్ హిట్ గా నిలిచింది. శుభం సినిమా కాస్త మెల్లగా పుంజుకుంది. దీంతో మొదట జీ5 ఓటీటీతో కుదిరిన ఒప్పందం రద్దయింది. ఆ తర్వాత జియోహాట్‌స్టార్ ఓటీటీ ఏకంగా రూ.3 కోట్లకు ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.

కేవలం రూ.2.5 కోట్లతో రూపొందిన ఈ సినిమాకు ఇది చాాలా పెద్ద మొత్తమే. అంతకుముందే బాక్సాఫీస...