భారతదేశం, జూన్ 30 -- తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. భారీ పేలుడు సంభవించి ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మంటలను ఆర్పడానికి, సహాయక చర్యల కోసం 11 అగ్నిమాపక యంత్రాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్పత్తి యూనిట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్, ఇతర ఫార్మా ఎక్సిపియంట్స్, ఆహార పదార్థాలను తయారు చేసే ప్రముఖ సంస్థ ఇది. "ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు పటాన్చెరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు" అని ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.