భారతదేశం, జూన్ 11 -- టాలీవుడ్ లో పాపులర్ డైరెక్టర్లలో ఒకరు, హిట్ సినిమాలు అందించిన ఏఎస్ రవి కుమార్ చౌదరీ కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు రవి కుమార్ మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యం బాధపడుతున్న రవి కుమార్ గుండెపోటుతో మరణించారు. తెలుగు సినిమా రంగంపై ఆయన తనదైన ముద్ర వేశారు. హిట్ సినిమాలతో సత్తాచాటారు.

ఏఎస్ రవి కుమార్ చౌదరి హీరో గోపీచంద్ సినిమాతో డైరెక్టర్ గా డెబ్యూ చేశారు. ఆ సినిమా పేరు యజ్ఞం. యజ్ఞం మూవీతో తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్న రవి కుమార్.. తొలి మూవీతోనే హిట్ కొట్టారు. గోపీచంద్ కెరీర్ లోనే యజ్ఞం మూవీకి స్పెషల్ ప్లేస్ ఉంది. ఈ సినిమాతో హీరోగా గోపీచంద్ కెరీర్ ఊపందుకుంది.

ఏఎస్ రవి కుమార్ చౌదరి బాల‌కృష్ణతో వీరభద్ర సినిమా చేశారు. 'సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం' అనే ఫేమస్ మీమ్ డైలాగ్ ఈ సినిమ...