భారతదేశం, మే 3 -- ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో ఉన్నట్లుండి గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబడా స్వదేశం దక్షిణాఫ్రికా వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ ఫాస్ట్ బౌలర్ ఎందుకు వెళ్లాడో ఎవరికీ తెలియలేదు. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పుడు రబాడ సీజన్ మధ్యలో వెళ్లిపోవడంపై ఓ క్లారిటీ వచ్చింది. డ్రగ్ టెస్టులో రబాడ పాజిటివ్ గా తేలడమే ఇందుకు కారణం.

ప్రొటీస్ పేసర్ కగిసో రబాడ ఎట్టకేలకు ఐపీఎల్ 2025కు దూరం కావడానికి గల కారణాన్ని వెల్లడించాడు. డ్రగ్ టెస్టులో పాజిటివ్ గా తేలడంతో తాత్కాలిక సస్పెన్షన్ అనుభవిస్తున్నానని వెల్లడించాడు. అభిమానులను నిరాశపరిచినందుకు క్షమించాలని కోరాడు. క్రికెట్ ఆడే అవకాశాన్ని తానెప్పుడూ తేలిగ్గా తీసుకోనని పేర్కొన్నాడు. ఎస్ఏ20లో ఎంఐ కేప్టౌన్ తరఫున ఆడే సమయంలో అతను డ్రగ్స్ తీసుకున్నాడు. అయితే ఇది పనితీరును పెంచే...