భారతదేశం, మే 8 -- అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్ జి ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు. ఈ రోజు ఎల్‌జీ యూనిట్ కు మాత్రమే కాదు - ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నామని ప్రకటించారు.

రూ.5వేల కోట్లకు పైగా పెట్టుబడితో LG ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయి తయారీ యూనిట్‌ను తీసుకురావడమే కాకుండా ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మారుస్తుందని నారా లోకేష్‌ చెప్పారు.

మేడ్ ఇన్ ఆంధ్రా నుండి మేడ్ ఫర్ ది వరల్డ్ వరకు తమ జైత్రయాత్ర కొనసాగుతుందని చెప్పారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ప్రధాన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకటిగా ఎల్జీ శ్రీసిటీ యూనిట్ ఆవిష్కృతమైందని చెప్పారు.

పారిశ్రామిక రంగంలో వేగం, బలమైన మౌలిక సదుపాయాలు... ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై చంద్రబాబునాయుడ...