భారతదేశం, జనవరి 29 -- టాలీవుడ్‌లో లేటెస్ట్‌గా తెరకెక్కిన సినిమా 'శ్రీ చిదంబరం గారు'. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా ఈ సినిమాను నిర్మించారు. అలాగే, శ్రీ చిందబరం గారు సినిమాకు చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా ఉన్నారు.

'శ్రీ చిదంబరం గారు' సినిమాకు వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే, ఇటీవల శ్రీ చిదంబరం గారు మూవీ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది.

కాగా శ్రీ చిదంబరం గారు చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి ఆలపించిన 'వెళ్లేదారిలో' అనే బ్యూటిఫుల్‌ పాటను సైతం రీసెంట్‌గా రిలీజ్ చేశారు దర్శకనిర్మాతలు. ఈ సాంగ్ కూడా టాలీవుడ్‌లో మంచి రెస్పాన...