భారతదేశం, ఫిబ్రవరి 10 -- మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం శ్రీశైలం ఆలయంలో జనసమూహాన్ని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వేలాది మంది శివభక్తులు మల్లన్న దర్శనానకి వచ్చారు. ఉదయం నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఐదు గంటల నుంచే భక్తులు, శివస్వాములు క్యూలైన్లలో వేచి ఉన్నారు. గంటలు గడుస్తున్నా.. క్యూ లైన్‌లు ముందుకు జరగలేదు. దీంతో భక్తుల్లో అసహనం మెుదలైంది. కనీసం తాగేందుకు కూడా నీరు లేదని ఆగ్రహం వ్యక్తమైంది.

దర్శనం కోసం ఎదురుచూసే కొందరు భక్తులు ఉక్కపోత, నీరసంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని భక్తులు ఆరోపించారు. ఆలయ ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపటికే పరిస్థితి చేయిదాటి పోయింది. శివస్వాములు క్యూలైన్ల నుంచి బయటకు వచ్చి నిరసన తెలియజేశారు. దీంతో మల్లన్న ఆలయంలో ఉద్...