భారతదేశం, మే 21 -- ఛత్తీస్ గడ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు(70) అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా తెలిపారు.

నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, క్రిష్ణ, వినయ్, బసవర రాజు, ప్రకాష్ ఇలా చాలా మారుపేర్లతో ఉద్యమాన్ని నడిపారు. 2018 నవంబర్‌లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా అనంతరం కేశవరావు మావోయిస్టు సుప్రీం కమాండర్ అయ్యారు. కేశవరావు స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామం. కేశవరావుకు సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.

స్వగ్రామంలో ప్రాథమిక విద్య అభ్యసించిన కేశవరావు....టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్ చదువు, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశారు. డిగ్రీ రెండో ఏడాది చదువుతుండగా వరం...