భారతదేశం, ఫిబ్రవరి 12 -- శివరాత్రి నాడు పరమేశ్వరుని అనుగ్రహం కలగాలంటే శివుని ప్రత్యేకించి ఆరాధించాలి. అలాగే కొన్ని పరిహారాలను పాటిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. శివ పురాణంలో ధన లాభం కలగడానికి, సమస్యలు తొలగిపోవడానికి కొన్ని ఉపాయాల గురించి తెలియజేయడం జరిగింది. శివుడికి సంబంధించి ఎన్నో పురాణాలు ఉన్నా, శివ పురాణం చాలా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మన కోరికలు నెరవేరడానికి పరిహారాల గురించి ఇందులో చెప్పారు. ధన లాభం కలగాలంటే శివ పురాణం ప్రకారం వీటిని శివరాత్రి నాడు పాటించడం మంచిది.

ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 15, ఆదివారం నాడు వచ్చింది. ఆ రోజు శివుడిని ఆరాధించి, ఉపవాసం ఉండి జాగరణ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని పరిహారాలను పాటిస్తే కూడా మంచి జరుగుతుంది.

శివుడికి అక్షింతలను సమర్పించండి. విరిగిపోయిన వాటిని సమర్పించకూడదు. శివ పూజల...