భారతదేశం, మే 8 -- క్షిణ కొరియా టెక్ కంపెనీ శాంసంగ్ తన ఎఫ్-సిరీస్‌లో అత్యంత సన్నని ఫోన్‌ను లాంచ్ చేసింది. కంపెనీ గెలాక్సీ ఎఫ్ 56 5జీని మిడ్ రేంజ్ సెగ్మెంట్లోకి తీసుకువచ్చింది. దీని మందం కేవలం 7.2 మిమీ. ఫ్లాగ్ షిప్ గ్రేడ్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉన్న ఈ ఫోన్ 6వ జనరేషన్ వరకు ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లను పొందుతుంది. ఇది ముందు, వెనుక రెండింటిలో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ రక్షణతో వస్తుంది.

120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోఎల్ఈడీ ప్లస్ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఇది గీతలు, ఇతర నష్టం నుండి రక్షిస్తుంది. ఫోన్ డిజైన్ స్లిమ్‌గా, ప్రీమియంగా ఉండడంతో చేతిలో పట్టుకునేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఎక్సినోస్ 1480 ప్రాసెసర్, 8 జీబీ LPDDR5X ర్యామ్‌ను ఇంద...