భారతదేశం, జూన్ 6 -- అమెరికాలో ఆపరేషన్ సింధూర్ పై బహుళ పార్టీల ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు ఆయన కుమారుడు ఇషాన్ థరూర్ వాషింగ్టన్ డీసీలో జరిగిన మీడియా సమావేశంలో ఒక కీలక ప్రశ్న వేశారు.

గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్ దేశాల్లో పర్యటించిన శశిథరూర్ అండ్ టీం మంగళవారం మధ్యాహ్నం వాషింగ్టన్ చేరుకున్నారు. శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ వాషింగ్టన్ పోస్ట్ లో గ్లోబల్ అఫైర్స్ కాలమిస్ట్ గా పనిచేస్తూ గురువారం ఆ హోదాలో తన తండ్రిని మీడియా సమావేశంలో ఒక కీలక ప్రశ్న అడిగారు.

శశిథరూర్ ను ఆయన కుమారుడు ఇషాన్ థరూర్ ఈ కింది విధంగా ప్రశ్నించారు. ''పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్ర ఉందనడానికి రుజువులు ఉన్నాయా? అని ఏ దేశమైనా ప్రశ్నించిందా?'' అని ఇషాన్ ప్రశ్నించారు. పాకిస్తాన్ పాత్ర ఉందని తెలిపే రుజువుల గురించి ఏ దేశమైనా మీ ప్ర...