భారతదేశం, మే 2 -- రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ‌లు, వ‌డ‌గాలుల నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌వ‌ల‌సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని.. ఆమేర‌కు సంబంధిత శాఖ‌లు ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఈ ఏడాదిలో ఎండ‌లు, వ‌డ‌గాలులు అధికంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని, జూన్ వ‌ర‌కు కూడా అధిక ఉష్ణోగ్ర‌త‌లు ఉంటాయ‌ని ఐఎండీ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో.. తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌పై 12 శాఖ‌ల‌తో పొంగులేటి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

తెలంగాణ రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌, ఐఎండీ క‌లిసి స‌మ‌గ్ర తెలంగాణ స్టేట్ హీట్‌వేవ్ యాక్ష‌న్ ప్లాన్-2025 ను రూపొందించాయి. ఇందులో భాగంగా ప్ర‌తి జిల్లాకు ఒక నోడ‌ల్ అధికారిని నియ‌మించాం. ఈ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ -2025ను మంత్రి పొంగులేటి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధిక ...