భారతదేశం, మే 14 -- వైఎస్ఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లెలో చెరువులో దిగిన ఐదుగురు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు.చెరువులో మునిగిన చిన్నారులను తరుణ్, చరణ్, పార్దు , హర్ష, దీక్షిత్‌గా గుర్తించారు. సమాచారం అందుకొన్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.

వేసవి సెలవుల్లో ఆనందంగా గడుపేందుకు బంధువుల ఇళ్లకు వచ్చిన చిన్నారులు ఒకేసారి ప్రమాదానికి గురయ్యారు. ఆడుకుంటూ ఊరి చెరువు వైపు వెళ్లిన చిన్నారులు అందులో దిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

ఈ ఘటన కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బోధనం గ్రామానికి చెందిన సుబ్బయ్య కుమారుల...