Tiruma;a,andhrapradesh, ఏప్రిల్ 26 -- తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సమ్మర్ హాలీడేస్ తో పాటు వీకెండ్ కావటంతో. చాలా ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

మరోవైపు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలను తనిఖీ చేసే ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో వాహనాలు కూడా భారీగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునే పనిలో టీటీడీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఇటీవలనే తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. దీంతో చాలా మంది కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీకెండ్స్ లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. భక్తుల రద్దీ పెరిగే ఛాన్స్ ఉన్న దృష్ట్యా. టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించ...