Telangana,hyderabad, మే 22 -- తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు బుధవారంతో ముగిసింది. మరోవైపు వెబ్ ఆప్షన్ల గడువు కూడా ఇవాళ్టి(మే 22)తో పూర్తి కానుంది. మరికొన్ని గంటలు మాత్రమే ఉండటంతో. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

దోస్త్ ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి 87వేలకుపైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో 50 వేలకుపైగా మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. మిగిలిపోయిన విద్యార్థులు కూడా https://dost.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మే 29వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు.

దోస్త్ 2025 ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థ...