భారతదేశం, జనవరి 4 -- ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. భారీ చమురు నిల్వలున్న వెనెజువెలాలో అమెరికా సైన్యం శనివారం మెరుపు దాడి చేసి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకుంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేపట్టిన ఈ 'రెజీమ్ ఛేంజ్' ఆపరేషన్ ఒక్కసారిగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచంలోనే అత్యధిక ముడిచమురు నిల్వలున్న దేశాల్లో ఒకటైన వెనెజువెలాలో నెలకొన్న ఈ అనిశ్చితి, గ్లోబల్ సప్లై చైన్‌ని ఎలా ప్రభావితం చేస్తుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సైనిక చర్య అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. "వెనెజువెలా చమురు రంగంలో అమెరికా ఇకపై చాలా బలంగా జోక్యం చేసుకుంటుంది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన అమెరికన్ ఆయిల్ కంపెనీలు అక్కడ కీలక పాత్ర పోషిస్తాయి," అని మీడియాకు ఇచ్చిన ...