Hyderabad, మే 22 -- మేము 05 మార్చి 2024 తెల్లవారుజామున 4.30కి విశాఖపట్నం నుంచి ట్రైన్ లో వారణాసికి బయలుదేరాం. అది 30 గంటల సుదీర్ఘ రైలు ప్రయాణం. మాకు మొదటిసారి ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణం. పుస్తకపఠనంతోనే రైలు ప్రయాణ కాలం గడిచిపోయింది.

మర్నాడు ఉదయం ట్రైన్ 12.30కి కాశీ చేరుకుంది. వారణాసిలో అడుగపెట్టగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. ఆటో తీసుకుని మేం రూమ్ తీసుకున్న విశాఖ శారదాపీఠం ఆశ్రమానికి వెళ్లిపోయాం. మెయిన్ రోడ్ మీద నుంచి ఆశ్రమానికి ఒక అర కిలోమీటర్ దూరం నడిచి వెళ్లాల్సి వచ్చింది. కాశీలో ఆశ్రమాలన్నీ ప్రధాన రోడ్లకు సమీపంలో ఉండవు. అన్నీ కూడా చిన్న చిన్న సందులు, గొందుల్లోనే ఉంటాయి.

రూమ్ కి వెళ్లిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి వెంటనే గంగా స్నానానికి వెళ్లాం. మా రూమ్ నుంచి ఒక 300 మీటర్లు దూరం వెనక్కి వెళ్తే... మానససరోవర్ ఘాట్ ఉంది. అక్కడ స్న...