భారతదేశం, ఫిబ్రవరి 22 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా విశాఖపట్నం డిపో నుంచి ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త బస్సును అందుబాటులోకి తీసుకువచ్చింది. విశాఖపట్నం నుండి విజయవాడకు కొత్త నైట్ రైడర్ ఏసీ సీటర్ కమ్ స్లీపర్ బస్సు సర్వీసును ప్రారంభించింది. విశాఖపట్నం ప్రాంతీయ మేనేజర్ అప్పల నాయుడు కొత్త సర్వీస్ గురించి తెలిపారు.

విశాఖపట్నం నుంచి రాత్రిపూట స్లీపర్ బస్సులో ప్రయాణించాలనుకునే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ నైట్ రైడర్ స్లీపర్ బస్సు సర్వీస్‌ను ప్రారంభించిందని అప్పలనాయుడు అన్నారు. నైట్ రైడర్ సర్వీస్ ప్రతిరోజూ రాత్రి 9:30 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది.

అనుభవజ్ఞులైన డ్రైవర్లు వాహనాలను నడుపుతారని, ఒత్తిడి లేకుండా, సురక్షితంగా ప్రయాణం ఉండేలా చూస్తారని మే...