Hyderabad, మే 8 -- జీవితంలో వివాహం అనేది అతి ముఖ్యమైన భాగం. వివాహం తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. కేవలం భౌతిక జీవితంలోనే కాదు ఆరోగ్యంలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా వివాహం తర్వాత మెదడుకు సంబంధించిన తీవ్రమైన వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయని వివరిస్తోంది.

జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ అసోసియేషన్లో ప్రచురించిన ఒక కొత్త పరిశోధన ప్రకారం వివాహం అయినవారిలో మెదడు సంబంద వ్యాధి అయినా డిమెన్షియా అంటే చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం ఎక్కువ.

వైద్యులు చెబుతున్న ప్రకారం ప్రతి అనుబంధానికి దాని సొంత భావోద్వేగ వ్యవస్థ ఉంటుంది. అలాగే వివాహం మాత్రమే డిమెన్షియాకు ప్రధాన కారణం అని చెప్పలేము. అయితే ఇది రావడానికి ఇంకా ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. భారతదేశంలో మాత్రం వివాహిత స్త్రీలలో చిత్త వైకల్యం రావడానికి వారి కుటుంబాలే ...