Andhrapradesh, జూన్ 10 -- విద్యార్థుల కోసం టీటీడీ వినూత్న కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వారిలో మానవతా విలువను పెంపొందించేందుకు 'సద్గమయ' పేరుతో కొత్త కార్యక్రమం చేపట్టనుంది. ఇందుకు సంబంధించి ఈవో శ్యామలరావు కీల ప్రకటన చేశారు. ఈ నెల 16 నుండి 19 తేదీ వరకు సద్గమయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంపై సమీక్షించిన ఈవో. టీటీడీకి చెందిన 7 పాఠశాలలలో విద్యార్థులకు దైవభక్తి, నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యత తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

భగవద్గీత సారాంశాన్ని పిల్లలకు అర్థమయ్యేలా, సరళమైన పదజాలంతో బోధించాలని ఈవో సూచించారు. శ్రీవారి వైభవాన్ని యువత, పిల్లలకు మరింతగా తెలిసేలా శిక్షణ ఉండాలన్నారు. బాలబాలికలకు చిన్న వయసు నుంచే సనాతన ధర్మం, ఉమ్మడి...